పత్రికలో ప్రచురించిన, ఎస్.ఎం.సుభాని గారి కవిత లొని ఈకింది extracts మన ముందు తరాలవారిపైన, మారిన మనధోరణికి, మొక్కుబడి నివాళులకి దర్పణంపడుతున్నాయి. అవలోకించండి.
గాంధి, నెహ్రూ, శాస్త్రి, భగత్సింగ్….
పుట్టినరోజు ఎవరిగైనా,
ఆ ఒక్కరోజు సందడే సందడి
దేశమంతా ఒకటే హడావుడి.
మరుగున పడిన విగ్రహాలకు
మార్పులు-చేర్పులు,రంగులు వేసి
మరీ మరమ్మత్తులు.
ఖద్దరు పంచెకట్టి, నెత్తిన టోపి పెట్టిన
నాయకుల నటనలకు జతబడి,అధికారుల అలజడి.
ఎటుచుసినా సభలు-సమావేశాలు,చిందులతో విందులు.
మురిపించే మువ్వన్నెల తోరణాలు
జండా వందనాలు, జతీయ గీతాలాపనలు.
భక్తితో..శ్రద్దాంజలులు, సర్వమత ప్రార్ధనలు.
మరుసటి రోజు నుండి, ఎవరి పంథా వారిదే, ఎవరి దందా వారిదే.








